టక్ జగదీష్ లో భూమిక.. మళ్ళీ నానికి వదినగానే?
on Dec 4, 2020
కథానాయిక వేషాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయిన భూమికకి.. ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) చిత్రం నటిగా మరోసారి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇందులో నేచురల్ స్టార్ నానికి వదిన పాత్రలో దర్శనమిచ్చింది ఈ మోడ్రన్ మిస్సమ్మ. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మరోసారి నానికి వదిన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ టాలెంటెడ్ స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. నిన్ను కోరి తరువాత నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో టక్ జగదీష్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. నానికి అన్నగా జగపతిబాబు కనిపించబోతున్నారు. ఇక జగపతిబాబుకి జంటగా భూమిక నటిస్తోందని సమాచారం. త్వరలోనే భూమిక ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ శుక్రవారం నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న టక్ జగదీష్ 2021 వేసవి ఆరంభంలో తెరపైకి వచ్చే అవకాశముంది.