2018లో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన కొత్తందాలు!!!
on Dec 27, 2018
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్కి కొత్త సొగసులు పరిచయమయ్యాయి. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ పర్ఫార్మర్స్ గా పేరు తెచ్చుకున్నారు. వరుస ఆఫర్స్తో దూసుకెళ్తున్నారు. మరి 2018లో బాక్సాఫీస్ పై తమ అందచందాలతో దాడి చేసి, కుర్రాళ్లను ఫిదా చేసిన ఆ కొత్త అందాలపై ఓ లుక్కేద్దాం...
రష్మిక మండన్నా...
ఈ ఏడాది `ఛలో` చిత్రంతో సక్సెస్ ఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా వెంకి కుడుముల పరిచయమయ్యాడు. అలాగే హీరోయిన్ గా రష్మిక మండన్న పరిచయమైంది. బాక్సాఫీస్ వద్ద హంగామా చేసిన ఈ చిత్రం ద్వారా రష్మిక నటనకు మంచిపేరొచ్చింది. ఆ తర్వాత సెన్సేషనల్ హీరో విజయదేవరకొండ సరసన `గీతగోవిందం` చిత్రంలో నటించిన ద్వితీయ విఘ్నం కూడా విజయవంతంగా దాటింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్.ఇక నాగార్జున ,నాని కలయికలో వచ్చిన `దేవదాసు` చిత్రంలో కూడా రష్మిక నటించి ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఒదిగిపోతూ నూటికి నూరుశాతం న్యాయం చేసే రష్మిక ప్రస్తుతం విజయ
దేవర కొండతో `డియర్ కామ్రేడ్` చిత్రంతో నటీస్తోంది. హీరోయిన్ గా కన్నడ. మలయాళం భాషల్లో బిజీ బిజీ గా ఉంది.
క్యా ... కియారా..
మహేష్ బాబు నటించగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం `భరత్ అనే నేను`. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. అందం,అభినయంతో ఆకట్టుకున్న కియారా మాయలో కుర్రాళ్లు వెర్రోళ్లు అయిపోయారు. ఇక తన రెండో సినిమాగా రామ్ చరణ్ సరసన ` వినయ విధేయ రామ`లో నటిస్తోంది క్యారెట్ లా ఉండే కియరా. ఈ సినిమాతో తెలుగు లో టాప్ హీరోయిన్స్ లో చేరిపోవడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. సంక్రాంతికి రానుందీ సినిమా.
పాయల్ రాజ్ పుత్...
`అర్జున్ రెడ్డి` తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా అజయ్భూపతి, హీరోగా కార్తికేయ, హీరోయిన్గా పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్కు పరిచయమయ్యారు. అడల్ట్ కంటెంట్తో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్తో వచ్చిన ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరువచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను డిఫరెంట్గా మలిచాడు దర్శకుడు. పాయల్ రాజ్ పుత్ పాత్రకు తగ్గట్టుగా రెచ్చిపోయి నటించి పోరగాళ్లను పాయల్...పాగల్ గాళ్లను చేసింది. బిగుతైన తన అందంతో రాజ్ పుత్ అందరి మతి పోగొట్టేసింది. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
మనసులు దోచుకున్న నాభా...
నన్ను దోచుకుందువటే చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది నాభా నటేష్. సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా ఆర్. ఎస్.నాయుడు అనే కొత్త కుర్రాడితో పాటు నాభ నటేష్ హీరోయిన్ గా పరిచయమైంది.ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ చిత్రం. తన నేచరల్ పర్పార్మెన్స్ తో సినిమా కే హైలెట్ గా నిలించింది నాభా నటేష్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. మరికొన్ని అవకాశాలు కూడా వస్తోన్నట్లు తెలుస్తోంది.
టాక్సీవాలా...
గతంలో నటించినా కానీ, పెద్దగా పేరు రాలేదు ప్రియాంక జవాల్కర్. సెన్సేసనల్ హీరో విజయ్ దేవరకొండతో `టాక్సీవాలా`చిత్రంలో నటించి అందరి కంట పడింది. ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో తన గ్లామర్, పర్పార్మెన్స్ ప్లస్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి కావడం విశేషం. టాక్సీవాలా సక్సెస్ కావడంతో ప్రియాంకకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
రియా సుమన్...
ఈ ఏడాది వచ్చిన మ్యూజికల్ అండ్ జెన్యూన్ లవ్ స్టోరి `పేపర్ బాయ్` చిత్రం. ఈ చిత్రం ద్వారా హీరోగా సంతోష్ శోభన్, దర్శకుడుగా జయ శంకర్, హీరోయిన్ గా రియా సుమన్ పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ పర్పార్మర్ గా పాస్ మార్కు కొట్టేసింది. రియా సుమన్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలు కమిట్ అయినట్లు తెలుస్తోంది.
వీరితో పాటు చి.ల.సౌ చిత్రం ద్వారా రుహాని శర్మ, `మెహబూబా` చిత్రం ద్వారా నేహ శెట్టి, ఇంకా మాళవిక శర్మ, మైరా శరన్, సిద్ది ఇదాని, కావ్య టప్పర్ ఇలా కొంతమంది తారలు తెలుగు తెరపై మెరిసారు.