బాలయ్యతో మళ్లీ మంగమ్మ గారి మనవడు..?
on Mar 3, 2016

సింపుల్ కథతో మంచి పల్లెటూరిలో తెరకెక్కిస్తే సినిమా మినిమం గ్యారంటీ అన్నది టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. గతంలో పంచెకట్టుతో మంగమ్మగారి మనవడు లాంటి స్వచ్ఛమైన పల్లెటూరి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు బాలయ్య. నాగార్జున తన నిర్మాణంలో తీసిన ఉయ్యాల జంపాల, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యాయి. సోగ్గాడైతే సంక్రాంతికి బరిలో దిగి 50 కోట్లు కొల్లగొట్టింది.
అందుకే బాలయ్య ధైర్యంగా తన వందో సినిమాను రైతు కథతో తెరకెక్కించాలని ఫిక్సయ్యారు. ఆ ఉద్దేశంతోనే వైవిధ్యంగా ఉన్న కృష్ణవంశీ కథకు ఒకే చెప్పారు. వందో సినిమాలో బాలయ్య పంచెకట్టుతో, పక్కా పల్లెటూరి కథతో ఇరగదీయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా మంగమ్మ గారి మనవడుకు దగ్గరగా ఉండేలా కృష్ణవంశీ కథను తయారుచేసుకున్నారని సమాచారం. మరి బాలయ్యబాబు పంచెకట్టులో ఎలా ఉంటాడో మళ్లీ చూడాలంటే, నందమూరి అభిమానులు ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



