నిర్మాతగా అనుష్క చూసేది అదే!
on Jun 4, 2020
హిందీ కథానాయిక అనుష్క శర్మ నటించిన సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాలేదు. అయితే, ఆమె పేరు మాత్రం వార్తల్లో మారుమ్రోగుతోంది. దీనికి కారణం ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత మాత్రమూ కాదు. అనుష్క శర్మ నిర్మించిన తొలి వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్'. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ మీద విమర్శలు ఎన్ని వస్తున్నాయో.... అంతకంటే ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. యూనిక్ కంటెంట్ అని పలువురు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతగా తాను కథలో ఏం చూసేది అనుష్క శర్మ తెలిపారు.
"మేం ఎన్.హెచ్.10' ఫిల్మ్ చేశాం. ఫ్రెండ్లీ గోస్ట్ కథతో 'ఫిల్లౌరి' చేశాం. పాత్ బ్రేకింగ్ డిఫరెంట్ వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్' చేశాం. బోల్డ్, డిఫరెంట్, అవుట్ అఫ్ బాక్స్ కంటెంట్ మీద మాకు ఆసక్తి ఎక్కువ. నేనెప్పుడూ యూనిట్ ఐడియాల కోసం అన్వేషిస్తున్నాం. నేను చూసేది యూనిక్ కంటెంట్ కోసమే" అని అనుష్క శర్మ తెలిపింది. సినిమా లేదా వెబ్ సిరీస్ ఒక ఐడియా నుంచి బౌండ్ స్క్రిప్ట్ గా రూపాంతరం చెందే వరకు అందులో నిర్మాతగా తన ప్రమేయం ఉంటుందని ఆమె తెలిపింది.