రజనీకాంత్ రావడానికి టైమ్ పడుతుందట!
on Sep 25, 2020
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా 'అణ్ణాత్తే'. దీనికి శివ దర్శకుడు. తెలుగులో 'శంఖం', 'శౌర్యం', 'దరువు' చిత్రాలు తీసిన అతడు, ఆ తరవాత తమిళ పరిశ్రమకు వెళ్లి అజిత్ హీరోగా వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీశాడు. దాంతో రజనీకాంత్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. కరోనాకి ముందు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశారు. అందులో రజనీ, ఆయన కుమార్తెగా నటిస్తోన్న కీర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ వచ్చే నెలలో సినిమా చిత్రీకరణ పునఃప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ రెండో వారం నుండి హైదరాబాద్లో 'అణ్ణాత్తే' లేటెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అయితే, అందులో రజనీకాంత్ పాల్గొనడం లేదని చెన్నై సమాచారం. ఆయన షూటింగుకి రావడానికి టైమ్ పడుతుందట. ముందు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తారట. తరవాత రజని జాయిన్ అవుతారని అంటున్నారు. కరోనా నేపథ్యంలో చిత్రీకరణ చేయడానికి పూర్తి జాగ్రత్తలు తీసుంటామని యూనిట్ అంటోంది. షూటింగుకు వచ్చే ఆర్టిస్టులను ముందుగా క్వారంటైన్ లో ఉంచుతున్నారట.
Also Read