చెప్పి మరీ బన్నీ బ్లాక్బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ!
on Jan 13, 2020
ఏడాదిన్నర క్రితం ఒక మంచి సినిమా చెయ్యడానికి కొంచెం టైం తీసుకుంటానని, దాని కోసం కొంచెం ఓపిక వహించమని ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్ను అభ్యర్థించాడు అల్లు అర్జున్. ఇన్నాళ్ల తర్వాత ఆ ట్వీట్కు ఒక అభిమాని రెస్పాండై పెట్టిన పోస్ట్ బన్నీకి బాగా నచ్చేసింది. ఆ రిప్లై ట్వీట్ను తనికెళ్ల భరణి చేత చదివి వినిపింపజేశాడు బన్నీ. దానికీ ఒక కారణముంది.
"ఈ సినిమాతో ఎంటర్టైన్ చెయ్యగలిగే అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏడాదిన్నర క్రితం జూలై 26న నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్.. మై డియరెస్ట్ ఫ్యాన్స్.. థాంక్యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ టు లిటిల్ పేషెన్స్ అబౌట్ నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్మెంట్. బికాజ్ ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ వైల్ మోర్. ఐ వాంట్ టు జెన్యూన్లీ డెలివర్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్ టేక్స్ టైం. థాంక్యూ ఫర్ అండర్స్టాండింగ్.. ఇవాళ సినిమా రిలీజైన తర్వాత ఒక వ్యక్తి నాకు పంపిన రిప్లైని భరణిగారు చదువుతారు" అని మైకు భరణికి ఇచ్చాడు బన్నీ.
భరణి "చెప్పి మరీ బ్లాక్బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ" అని చదివి మైకు తిరిగి బన్నీకి ఇచ్చారు. 'ఈడు మగాడ్రా బుజ్జీ' అనేది 'అతడు' సినిమాలో భరణి చెప్పే డైలాగ్ కావడం గమనార్షం. ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమే. అందుకే భరణి అదే స్టైల్లో దాన్ని చదివారు. "అది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రం గారి డైలాగ్. ఇంత పెద్ద బ్లాక్బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకూ, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ లవ్ నాకు అందింది" అని చెప్పాడు బన్నీ. నార్త్ ఇండియాలో తాను చేసే ఫైట్లు ఇష్టపడతారనీ, తనకొచ్చిన యాక్షన్ ఇమేజ్కు కారణం రాం-లక్ష్మణ్ మాస్టర్స్ అనీ అతను తెలిపాడు. "సునీల్, నేనూ కలిసి చేసిన బోర్డ్ రూం సీన్కి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మా ప్రతి కాంబినేషన్ బ్లాక్బస్టర్ అని ఆయన చెప్పిన మాట నిజం" అని బన్నీ చెప్పాడు.
Also Read