ENGLISH | TELUGU  

అక్ష‌య్‌ మగాడ్రా బుజ్జి.. రూ. 25 కోట్లు ఇచ్చాడు!

on Mar 28, 2020

 

ఒకటి, రెండు, మూడు, నాలుగు కాదు... ఏకంగా పాతిక కోట్లు! బాలీవుడ్ కిలాడీ కుమార్ అక్షయ్ అక్షరాల పాతిక కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు స్పందించి తన సేవింగ్స్ నుండి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు అక్షయ్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గురించి ఒక పిలుపునిచ్చారు. ఎవరైనా సరే 'పిఎం కేర్స్ ఫండ్'కి విరాళం ఇవ్వవచ్చు అని తెలిపారు. చిన్న మొత్తంలో విరాళాలను కూడా స్పీకరిస్తామని అన్నారు. ప్రధాని అభ్యర్థునకు అక్షయ్ భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు‌. 

"ఈ సమయంలో మన ప్రజల జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దీని కోసం మనం ఏమైనా, ఏదైనా చేయాల్సిందే. పిఎం కేర్స్ ఫండ్‌కి నా సేవింగ్స్ నుండి పాతిక కోట్ల రూపాయలు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జీవితాలను కాపాడదాం" అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో కోట్లకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలు ఉన్నారు. ఆ మాటకు వస్తే టాలీవుడ్‌లో కూడా పది కోట్లకు పైగా పారితోషికం తీసుకునే హీరోల సంఖ్య తక్కువేమీ కాదు. ఒక్క సినిమాకు తాము తీసుకున్న పారితోషికం ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాలంటే ఆలోచిస్తారు. అటువంటిది చేతికి ఎముక లేనట్లు గా పాతిక కోట్ల రూపాయలను అక్షయ్ కుమార్ విరాళంగా ప్రకటించారు. ఎంతైనా అక్షయ్ మగాడ్రా బుజ్జి! ‌ఎవరైనా ఈమాట అనాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.