`భరత్ అనే నేను` బాటలో `ఆచార్య`!
on Jan 20, 2022
తెలుగునాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. `మిర్చి` (2013), `శ్రీమంతుడు` (2015), `జనతా గ్యారేజ్` (2016), `భరత్ అనే నేను` (2018).. ఇలా తను డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నారీ విజనరీ కెప్టెన్.
ఇదిలా ఉంటే.. త్వరలో `ఆచార్య`తో పలకరించబోతున్నారు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టిస్టారర్.. వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కొరటాల గత చిత్రం `భరత్ అనే నేను` కూడా నాలుగేళ్ళ క్రితం ఇదే ఏప్రిల్ నెలలో విడుదలై ఘనవిజయం సాధించింది. మరి.. `భరత్ అనే నేను` బాటలోనే ఏప్రిల్ మాసంలోనే విడుదల కానున్న `ఆచార్య` కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
కాగా, `ఆచార్య`లో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ కనిపించనుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. రెజీనా ఓ ప్రత్యేక గీతంలో చిందులేసిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సోనూ సూద్, సంగీత ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతమందించారు.
Also Read