ఆమిర్ ఖాన్: పాతికేళ్లుగా 'డీడీఎల్జే' ప్రపంచాన్ని మైమరపిస్తూనే ఉంది!
on Oct 21, 2020
బాలీవుడ్ ఐకనిక్ పెయిర్గా షారుఖ్ ఖాన్, కాజోల్ నిలవడంలో ప్రధాన పాత్ర వహించిన 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' (డీడీఎల్జే) ఫ్యాన్స్కు అక్టోబర్ 20 ప్రత్యేకమైన రోజు. ఆ సినిమా విడుదలై ఆ రోజుకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సినిమాలో షారుఖ్, కాజోల్కు సంబంధించిన లవ్లీ సీన్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, తమ హృదయాల్లో దానికున్న స్థానాన్ని గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు ఫ్యాన్స్. కేవలం ఫ్యాన్సే కాదు, పలువురు సెలబ్రిటీలు సైతం 'డీడీఎల్జే'పై తన అభిమానాన్ని ప్రకటించడం నిజంగా విశేషం. వారిలో ఆమిర్ ఖాన్ కూడా ఉండటం మరింత విశేషం!
"తన మనస్సాక్షిని కనుగొనే ఓ హీరో, తన గొంతు (స్వేచ్ఛ)ను కొనుగొనే ఓ హీరోయిన్, మనసు మారిన ఓ విలన్, మనందరిలో ఉండే దయాగుణం, మంచితనం, ఉన్నత స్వభావాలను 'డీడీఎల్జే' ప్రదర్శించింది. 25 సంవత్సరాలుగా ఆ సినిమా ప్రపంచాన్ని మైమరపిస్తూనే ఉంది" అని తన ట్విట్టర్ హ్యాండిల్లో రాసుకొచ్చాడు ఆమిర్. చివరలో అంత అందమైన ఫిల్మ్ తీసినందుకు ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్, కాజోల్, 'డీడీఎల్జే' టీమ్కు థాంక్స్ చెప్పాడు.
Also Read