అఖిల్కి గాళ్ఫ్రెండ్గా...
on Dec 3, 2018
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న సినిమా 'మిస్టర్ మజ్ను'. ఇందులో నిధీ అగర్వాల్ మెయిన్ హీరోయిన్. మోడ్రన్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇంపార్టెంట్ రోల్స్ చేశార్ట. వాళ్లల్లో నజియా దేవిడ్సన్ ఒకరు. 'మిస్టర్ మజ్ను'లో తాను అఖిల్కి గాళ్ఫ్రెండ్గా కనిపిస్తానని ఈ గుజరాతీ భామ చెబుతోంది. సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాలను లండన్లో తీశారని చెప్పింది. కథ చాలా మోడ్రన్గా వుంటుందనీ, యూత్కి బాగా కనెక్ట్ అవుతుందనీ నజియా తెలిపింది. తెలుగులో నజియాకు ఇదే తొలి సినిమా. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీతో సినిమా టాకీ పార్ట్, ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుందని అఖిల్ తెలిపారు. హైదరాబాద్లో బ్యాలెన్స్ సాంగ్ కోసం స్పెషల్ సెట్ వేయనున్నారు. ఆల్మోస్ట్ ఈ నెలలో ఆ పాట షూటింగ్ పూర్తి చేయనున్నారు. జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అఖిల్ ఇటీవల ట్వీట్ చేశారు.