'కార్తికేయ-2' మరో 'కాశ్మీర్ ఫైల్స్' అవుతుందా?!
on Aug 14, 2022
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ-2' శనివారం(ఆగస్టు 13న) విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రెండో రోజుకే భారీగా స్క్రీన్స్ పెంచుకున్న ఈ చిత్రం జోరు చూస్తుంటే మరో 'ది కాశ్మీర్ ఫైల్స్' అవుతుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల విడుదలైన మీడియం రేంజ్ సినిమాలతో పోల్చితే 'కార్తికేయ-2' చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలైంది. అయినప్పటికీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే మంచి టాక్ రావడంతో పాటు, హౌస్ ఫుల్స్ పడుతుండటంతో స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ డే హిందీ వెర్షన్ 60 స్క్రీన్ లో విడుదల కాగా, రెండో రోజు 300కి పైగా స్క్రీన్స్ కావడం విశేషం. తెలుగులోనూ స్క్రీన్ పెరుగుతున్నాయి. ఒక రోజు ముందు విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. 'కార్తికేయ-2'కి సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్క్రీన్స్ పెరిగే అవకాశముందని అంటున్నారు.
కేవలం మౌత్ టాక్ తోనే 'కార్తికేయ-2' స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని తెలిపేలా ఉన్న సినిమా కావడంతో నార్త్ లో లాంగ్ రన్ తో భారీ ఆదరణకు నోచుకునే ఛాన్స్ ఉందంటున్నారు. చిన్న సినిమాగా వచ్చి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్'లా 'కార్తికేయ-2' కూడా ఏదైనా అద్భుతం చేస్తుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించడం విశేషం. మరి 'కార్తికేయ-2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read