కీర్తి సురేశ్.. మరోసారి మెప్పిస్తుందా!
on May 21, 2022
`మహానటి` (2018) తరువాత కేరళకుట్టి కీర్తి సురేశ్ కెరీర్ కాస్త ట్రాక్ తప్పింది. అటు స్టార్ హీరోలతో జట్టుకట్టిన సినిమాలు కానీ.. ఇటు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కానీ కీర్తికి అంతగా అచ్చిరాలేదు. అలాంటి నేపథ్యంలో.. ఈ నెలలో వారం వ్యవధిలోపు వచ్చిన రెండు సినిమాలు కీర్తికి ఊరటనిచ్చాయి. ఆ చిత్రాలే.. `సాని కాయిదమ్`, `సర్కారు వారి పాట`. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో మే 6న నేరుగా స్ట్రీమ్ అయిన కోలీవుడ్ యాక్షన్ క్రైమ్ డ్రామా `సాని కాయిదమ్`.. కీర్తి సురేశ్ లోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించింది. అలాగే, మే 12న విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం `సర్కారు వారి పాట` కూడా చెప్పుకోదగ్గ ఫలితాన్ని అందించింది.
కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ మరో సినిమాతో పలకరించబోతోంది. ఈ సారి తన మాతృభాష మలయాళంలో కీర్తి సందడి చేయనుంది. టొవినో థామస్ తో కలిసి కీర్తి నటించిన `వాషి` అనే ఫన్ మూవీ.. జూన్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. మరి.. `సాని కాయిదమ్`, `సర్కారు వారి పాట`తో ఎంటర్టైన్ చేసిన కీర్తి.. తక్కువ గ్యాప్ లోనే వస్తున్న `వాషి`తోనూ మరోసారి మెప్పిస్తుందేమో చూడాలి.
Also Read