‘సైరా’ దర్శకుడు ఎందుకు లేడక్కడ?
on Oct 1, 2019
ముంబైలో ‘సైరా’ పబ్లిసిటీ ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్స్లో మెగాస్టార్ చిరంజీవి, సినిమా నిర్మాత, మెగాపవర్ స్టార్ రామ్చరణ్, సినిమాలో లక్ష్మి క్యారెక్టర్ చేసిన తమన్నా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న క్యారెక్టర్ చేసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. దర్శకుడు సురేందర్రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. చెన్నైకి అమితాబ్ బచ్చన్ రాలేదు. కానీ, చిరుతో పాటు చరణ్, తమన్నా ఉన్నారు. సినిమా గురించి ప్రెస్మీట్స్లో మాట్లాడారు. తమిళంలో సినిమాను విడుదల చేస్తున్న ఆర్.బి. చౌదరి, ఆయన కుమారుడు పాల్గొన్నారు. కొచ్చిలో ‘సైరా’ ఫంక్షన్కి అక్కడ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ వచ్చారు. అక్కడా దర్శకుడు సురేందర్రెడ్డి లేరు. ఎందుకు? అంటే... ‘సౌండ్ మిక్సింగ్, డీటీఎస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల’ అని సురేందర్రెడ్డి సమాధానం ఇచ్చారు.
‘‘సైరా నరసింహారెడ్డి’కి ఐదు సినిమాలకు పడినంత కష్టపడ్డాను. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదు భాషల్లో సినిమాకు డబ్బింగ్ చెప్పించాం. డబ్బింగ్లో తప్పులు ఉంటే కరెక్షన్ చేయించాం. తర్వాత ప్రతి భాషలో ప్రత్యేకంగా సౌండ్ మిక్సింగ్, డీటీఎస్ చేయించాం. ఇవన్నీ సోమవారం ఉదయానికి పూర్తయ్యాయి. అందుకని, నేను ఇతర రాష్ట్రాల్లో ప్రెస్మీట్స్, ఇంటర్వ్యూలకు వెళ్లలేదు. ఈ ఒక్క సినిమాకు ఐదు సినిమాలకు ఎంత కష్టపడతామో... అంత కష్టపడ్డాం’’ అని సురేందర్రెడ్డి చెప్పాడు. దీని తర్వాత సినిమాపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదనీ, మళ్లీ ఇంతటి భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకోవడం లేదనీ ఆయన అన్నారు.