అందులో రామ్ చరణ్ దంపతులు మిస్సింగ్!
on Dec 3, 2019
సోమవారం మెగాస్టార్ చిరంజీవి పెద్దల్లుడు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు పెద్ద కుమార్తె, విష్ణు సతీమణి సోమవారం రాత్రి హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో కజిన్స్ అందరికీ పార్టీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీలో యంగ్ బ్యాచ్ అందరూ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అల్లు అర్జున్ సతీసమేతంగా విచ్చేశాడు. అలాగే, అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ దంపతులు... చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్... వరుణ్ తేజ్, సాయి తేజ్, నిహారిక, ఇంకా పలువురు పార్టీకి అటెండ్ అయ్యారు. కజిన్స్ కమ్స్ ఫస్ట్ అంటూ సుష్మిత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే... ఈ పార్టీకి మెగా ఫ్యామిలీలో కజిన్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఒక్క రామ్ చరణ్ దంపతులు... సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ తప్ప. చరణ్ ఎందుకు అటెండ్ కాలేదో తెలియడం లేదు గానీ, ఉపాసన హైదరాబాద్ సిటీలో లేకపోవడంతో పార్టీకి రాలేకపోయారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రీకరణలో ఉన్నాడట.