ఫస్ట్ లుక్ లో విశాల్ శృతి
on Mar 28, 2014
సూర్యతో "సింగం2" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి "పుజై" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం ద్వారా మొదటిసారిగా విశాల్, శృతిహాసన్ లు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలు కానుంది. సత్యరాజ్, రాధిక ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. విశాల్ నటించిన "ఇంద్రుడు" చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది.