వర్మ మర్డర్లు చేయిస్తుంటే పోలీసులు ఎక్కడ..?
on Dec 23, 2016
బెజవాడ రౌడీయిజం, రంగా హత్య ప్రధాన నేపధ్యంగా రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ వంగవీటి. టైటిల్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే వర్మ మార్క్ పిక్చరైజేషన్ని ఊహించేశారు ప్రేక్షకులు..అంటే రక్తం ధారలు కట్టడం, కత్తులు, కటార్లు కామన్ అని. రామూ గత చిత్రాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేశాయి. తాజాగా వంగవీటి విషయంలో కూడా అదే తేలింది. అదంతా పక్కనబెడితే..సినిమాలో వంగవీటి, దేవినేని అనుచరులు కత్తులతో నడిరోడ్డుపైనే మర్డర్లు చేస్తుంటారు.
ఎంత 80ల నాటి కథ అయినా..అప్పుడు పోలీసులు లేరా..ప్రభుత్వం లేదా..? జనాన్ని ఇష్టమొచ్చినట్లు చంపుతూ ఉంటే రక్షకభటులు చూస్తూ ఊరుకున్నారా..? మిగిలిన దర్శకుల సినిమాల్లో కనీసం హత్య జరిగిన తర్వాతైనా పోలీసులు స్పాట్కు వస్తారు..కానీ వర్మ సినిమాల్లో అది కనిపించదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. వంగవీటిలో జరిగిన సంఘటనలనే చూపించిన వర్మ అప్పటి పోలీసు అధికారుల ప్రస్తావన తీసుకురాలేదు. మరీ ముఖ్యంగా అప్పట్లో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహిరించిన అధికారిపై వర్మ అంతగా దృష్టిసారించినట్లు లేరని ఆడియన్స్ టాక్.