నేటి తరాన్ని ఉసూరుమనిపించిన వర్మ
on Dec 23, 2016
రౌడీయిజం అంటే ఇప్పుడేముంది..రంగా అని ఉండేవాడు..? రంగాను దారుణంగా చంపేశారు..? 72 కత్తిపోట్లతో మనిషిని చంపడం విన్నవా..? రంగా చనిపోయినప్పుడు 40 రోజుల కర్ఫ్యూ పెట్టారట. తెలుగు రాష్ట్రాల్లో.. యువత నుంచి పండు ముసలివాళ్ల దాకా అందరి నోళ్లలో నానే మాటలివి. అయితే, ఇవి విన్నప్పుడల్లా చాలా మంది యూత్ కి అసలు రంగా ఎవరు..? రంగాకి అంత పేరు ఎలా వచ్చింది? ఆయన్ను చంపడానికి కారణం ఏంటి? అంటూ చాలా అనుమానాలే వస్తుంటాయి. వాట్ని క్లియర్ చేసుకోవటం కోసం పెద్దలను అడుగుతుంటారు కూడా. వారు కూడా తమకు తెలిసింది..తాము విన్నది పిల్లలకు చెప్పేవారు.
బెజవాడ రౌడీయిజం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి వాటిని నేటి యవత కూడా చూసింది. కాని వారికి పూర్తి కథ మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో తాను పూర్తి క్లారిటీ ఇస్తానని ముందుకువచ్చారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. చిన్నతనం నుంచి తనకు తెలిసింది..తాను చూసిన బెజవాడ కథను వంగవీటి పేరుతో తీస్తానని ప్రకటించారు. ఇంకేముంది ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని యువత ఎదురుచూడసాగారు. ఆ సినిమా రానే వచ్చింది. ఈ నేపథ్యంలో తమ ప్రశ్నలకు వర్మ అయినా సమాధానం చెబుతారేమోనని ఆశపడ్డ యువతను రామూ నిరాశ పరిచాడు.
ఎవరి గురించి పెద్దగా చెప్పకుండా..ఎవరిని నొప్పించకుండా కథను తేల్చేశాడు తప్పించి అసలు కారణాలు మాత్రం చెప్పలేదు. ఒక క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ వున్న స్టోరీని ఆర్జీవీ హ్యాండిల్ చేస్తే అంతా ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు? సాధారణంగా మనకు పేపర్ క్లిప్సింగ్స్ లో, టీవీ న్యూస్ లో కనిపించే సమాచారం కాకుండా తెర వెనుక నిజాలు బయటకొస్తాయనుకుంటారు. సత్యా నుంచి సర్కార్ దాకా ఆయన అలానే స్పెల్ బౌండ్ చేశాడు కూడా. కాని, వంగవీటి విషయంలో మాత్రం మసాలాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వంటకానికి ఇవ్వలేకపోయారు...