'SSMB28'పై తారకరత్న రియాక్షన్
on May 29, 2022
రీసెంట్ గా 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నందమూరి తారకరత్న నటించబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. 'SSMB28' అంటూ తారకరత్న పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా ఈ వార్తలను తారకరత్న ఖండించాడు.
తనకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని, ఎవరో ఫేక్ ఖాతాలు తెరచి తన పేరుతో ట్వీట్స్ చేస్తున్నారని, అలాంటి వార్తల్ని నమ్మొద్దని తారకరత్న తెలియజేశారు. ఈ విషయంపై గతంలో కూడా ఆయన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. "నాకు సంబందించి ఏ విషయం అయిన నా పీఆర్ టీం నుంచి సమాచారం అందుతుంది. దయ చేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు" అని తారకరత్న చెప్పారు.
`అతడు`, `ఖలేజా` వంటి కల్ట్ క్లాసిక్స్ తరువాత మహేష్, త్రివిక్రమ్ జట్టుకడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా నటించనుండగా, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
Also Read