మెగాస్టార్తో మరోసారి త్రిష రొమాన్స్!
on Sep 15, 2021
సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం `స్టాలిన్` (2006) చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తొలిసారి కనువిందు చేసింది చెన్నైపొన్ను త్రిష. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు జట్టుకట్టబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాట విజయం సాధించిన `వేదాళమ్` చిత్రాన్ని తెలుగులో `భోళా శంకర్` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేయనున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందనున్న `భోళా శంకర్`లో చెల్లెలుగా కేరళకుట్టి కీర్తి సురేశ్ కనిపించనుంది. కాగా, చిరుకి జంటగా త్రిష ఎంపికైందని బజ్. వాస్తవానికి మాతృకలో నాయికగా నటించిన శ్రుతి హాసన్ నే రీమేక్ లోనూ యాక్ట్ చేసే అవకాశముందంటూ కొన్నాళ్ళ క్రితం ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడా పాత్రలో త్రిషని సెలెక్ట్ చేశారని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. మరి.. `ఆచార్య` నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకున్న త్రిష.. ఈ `మెగా` ప్రాజెక్ట్ లోనైనా భాగమవుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్న `భోళా శంకర్` 2022 ద్వితీయార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనుంది.