టాలీవుడ్ హీరో తనీష్ తండ్రి కన్నుమూత..ప్రమాదమా? ఆత్మహత్యా?
on May 18, 2016

టాలీవుడ్ వర్థమాన హీరో తనీష్ తండ్రి వర్ధన్ కన్నుమూశారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వర్థన్ 6వ అంతస్తు నుంచి నిన్న అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. కుటుంబసభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్థన్ కన్నుమూశారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రమాదవశాత్తూ కింద పడ్డారా..? లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



