వీరయ్యతో ఆ నలుగురికి నిరాశే!
on Jan 25, 2023
ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అంటే అందరూ టక్కున మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య పేరు చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ చిత్రం ఆకర్షిస్తూ ఉండడం దీనికి ప్రధాన కారణం. వాల్తేరు వీరయ్య మాస్ యాక్షన్ థ్రిల్లరే అయినప్పటికీ ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా అలరిస్తూ ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. వింటేజీ లుక్ లో చిరంజీవి నాటి ఎవర్గ్రీన్ చిత్రాలైనా గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి, రిక్షావోడు, ఘరానా మొగుడు తరహాలో తన లుక్కుతో జనాలను కట్టిపడేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఎంటర్టైన్మెంట్ జోనర్ లోకి ప్రవేశిస్తే బాక్స్ బద్దలేనని మరోసారి నిరూపించారు. ఇక చిరుకు తోడుగా రవితేజ కూడా కలవడంతో ఈ చిత్రం రేంజ్ ఓ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ చిత్రం ముగ్గురికి నలుగురికి మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది.
ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఎవరిని పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక శృతిహాసన్ పాత్ర రా ఏజెంట్ అయిన అందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాటలకు పనికి వచ్చింది అంతే. మరోవైపు రవితేజకు జోడిగా నటించిన కేథరిన్ తెస్రా ది కూడ అదే పరిస్థితి. ఏదో ఒక ఏడుపు సన్నివేశానికే పరిమితమైంది. ఇక బాస్ పార్టీ అనే ప్రత్యేక గీతంలో నర్తించిన మాజీ మిస్ ఇండియా ఊర్వశిరౌతాల ఆ ఒక్క పాటే పరిమితమైంది. కనీసం ముఠామేస్త్రి లో సిల్క్ స్మితకు ఉన్నంత సీను కూడా ఆమెకు లేకుండా పోయిందని వినిపిస్తున్నాయి.
ఊర్వశి చాలా కాలంగా టాలీవుడ్ లో మంచి అరంగేట్రం కోసం ఆశగా ఆరాట పడుతోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఆమె ఏదేదో ఊహించుకుందట. కానీ చివరకు వచ్చేటప్పటికి ఆమెకు పూర్తిగా నిరాశే ఎదురయ్యింది. ఇది ఘనమైన అరంగేట్రం కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం ఆ నలుగురికి మాత్రం నిరాశనే మిగిలించింది. అయితే బాసును కం బ్యాక్ చేసేలా ఎలివేట్ చేయాలనే తపనలో బాబి వీళ్లను పెద్దగా చూపించాల్సిన అవసరం లేకుండా పోయిందనేది అందరూ ఏకతాటిపై చెప్తున్నా మాట.