కొరటాల మార్క్ మాస్.. తారక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్
on May 19, 2022
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ ని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ లో చూడటానికి ఆయన ఫ్యాన్స్ ఇష్టపడతారు. ఇప్పుడు కొరటాల శివ సినిమాతో ఫ్యాన్స్ కోరిక నెరవేరనుంది. తన సినిమాలలో ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకునే కొరటాల.. గతంలో తారక్ తో చేసిన బ్లాక్ బస్టర్ మూవీ 'జనతా గ్యారేజ్'లోనూ మెసేజ్ ఇచ్చాడు. కానీ ఈసారి కొరటాల రూట్ మార్చాడు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా తారక్ ని మాస్ గా చూపించడానికి సిద్ధమయ్యాడు. ఒక్క మోషన్ పోస్టర్ తోనే అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాడు.
రేపు(మే 20) తారక్ పుట్టినరోజు కావడంతో తారక్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'NTR30'కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వాయిస్ ఓవర్ తో కూడిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు.. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా" అంటూ తారక్ చెప్పే వాయిస్ ఓవర్ తో వీడియో స్టార్ట్ అయింది. సముద్ర తీరంలో అలలు, మెరుపులతో మోషన్ పోస్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కట్టి పట్టుకొని తారక్ సాలిడ్ గా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇక అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మోషన్ పోస్టర్ ను మరింత పవర్ ఫుల్ గా మార్చింది. 'ధైర్యం వ్యాధిలా మారితే.. భయమే దానికి విరుగుడు' అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
మోషన్ పోస్టర్ తో పాటు మూవీ టెక్నికల్ టీమ్ ని కూడా అధికారికంగా ప్రకటించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పని చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read