జూన్ 1 నుంచి థియేటర్ బంద్ లేదు..మనల్ని ఎవడ్రా ఆపేది
on May 24, 2025
జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్స్ ని మూసివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యాలు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అద్దె ప్రాతిపదికిన సినిమాలు ప్రదర్శిస్తుండంతో ఆదాయం సరిపోవడం లేదని, మల్టిప్లెక్స్ తరహాలో పర్శంటేజ్ ఇవ్వాలనేది థియేటర్ యాజమానుల ప్రధాన డిమాండ్. కొన్ని రోజుల క్రితం ఈ అంశంపై థియేటర్ యాజమాన్యం,డిస్ట్రిబ్యూటర్ లతో కొంత మంది నిర్మాతలు సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశంలో సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి ఫిలింఛాంబర్ లో సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసివేత నిర్ణయం నిరవధిక వాయిదా వేస్తున్నాం. ఈనెల 30న విశాఖపట్నంలో జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతుందని చెప్పాడు. ఈ సమావేశంలో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
ఇక థియేటర్స్ బంద్ వెనక కొంత మంది సినీ పెద్దలు ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ వీరమల్లు రిలీజ్ పై టెన్షన్ మొదలైంది. దీంతో దామోదర ప్రసాద్ చెప్పిన మాటతో పవన్ అభిమానుల్లో జోష్ నెలకొని ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
