చిరుకి పోటీగా సూర్య, తాప్సీ!
on Dec 6, 2021
`సైరా.. నరసింహారెడ్డి!` వంటి పాన్ - ఇండియా మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `ఆచార్య`. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామాలో చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా దర్శనమివ్వనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ఫిబ్రవరి 4న థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. అదే ఫిబ్రవరి 4న మరో రెండు సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. `జై భీమ్` వంటి ఓటీటీ సెన్సేషన్ అనంతరం కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన చిత్రం `ఎదర్కుమ్ తుణిందవన్`. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ తమిళ చిత్రాన్ని ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులోనూ ఈ సినిమాని అనువదించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అలాగే భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ జీవితం ఆధారంగా తాప్సీ టైటిల్ రోల్ లో నటించిన హిందీ చిత్రం `శభాష్ మిథు`ని కూడా అదే ఫిబ్రవరి 4కి టార్గెట్ చేశారు. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోనూ డబ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. సో.. చిరుకి పోటీగా సూర్య, తాప్సీ కూడా ఫిబ్రవరి 4న బరిలోకి దిగబోతున్నారన్నమాట. మరి.. వీరిలో ఎవరెవరు విజయకేతనం ఎగరవేస్తారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
