శృతి ఇంకా అంత దిగజారలేదట !
on Apr 28, 2014
గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో శృతిహాసన్ అందాలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. రాంచరణ్ తో కలిసి నటించిన "ఎవడు" చిత్రంలోని "పింపుల్ డింపుల్..." అనే పాటలో శృతి ఓ మోస్తారు అందాలను ప్రదర్శించింది. కానీ ఈ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో మరింత అందాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శృతి షాక్ అయ్యానని తెలిపింది.
ఈ విషయంపై శృతి స్పందిస్తూ... మాములుగా షూటింగ్ లొకేషన్స్ లో చిత్ర బృందానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లు రకరకాల కోణాల్లో ఫోటోలు తీస్తుంటారు. అభ్యంతకరంగా ఉన్న ఫోటోలను ఆ సినిమాకి సంబంధించినవారే తీసేస్తారు. వాటిని బయటకి వెళ్ళనీయరు. కానీ నా ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో నాకు తెలియడంలేదు. నేను ఈ విషయాన్నీ తేలికగా వదలను. పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను. వెబ్ సైట్స్ లో ఆ ఫోటోలను ఎవరు పెట్టారో తెలుసుకుంటాను. సినిమా కోసం పనిచేస్తున్న అందరిని నా కుటుంబాన్ని నమ్మినంతగా నమ్ముతాను. కానీ, నమ్మకద్రోహం చేసారు. అందుకు చాలా బాధగా ఉంది" అని అన్నారు.
పబ్లిసిటీ కోసమే ఇలా చేసారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు శృతి... "సినిమా ఎప్పుడో విడుదలై మంచి విజయం కూడా సాధించింది. ఇపుడు పబ్లిసిటీ చేసి ఏం చేసుకొని ఏం లాభం? అయినా పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాల్సిన కర్మ తనకు లేదని" ఆవేదనతో, ఆగ్రహంతో తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఇపుడు శృతి కేసు పెట్టేది దిల్ రాజు పైనేనా? దిల్ రాజు నిర్మించిన "రామయ్య వస్తావయ్యా", "ఎవడు" చిత్రాల్లో శృతి నటించింది. కానీ ఇపుడు, ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో మరోసారి దిల్ రాజు నిర్మాణంలో శృతి నటిస్తుందా? దీనిపై దిల్ రాజు ఎలా స్పందించనున్నాడో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.