ENGLISH | TELUGU  

చందు, పవిత్ర సంబంధంపై నరేష్ సంచలన కామెంట్స్...

on May 22, 2024

సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరికి ఏదైనా అయితే, మిగతా వారంతా అండగా నిలిచే వారు. ఇప్పుడు అలాంటి కల్చర్ లేదు. ఈ తరం వారు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. మా అమ్మ విజయనిర్మల గారు మరణించినప్పుడు.. నేను, కృష్ణ గారు ఎంతో కృంగిపోయాము. ఆ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాం. అలాగే కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. అలా ఆ బాధ నుంచి చిన్నగా బయటకు వచ్చాము. ఒక వ్యక్తి బాధపడుతుంటే.. పది మంది మనకి ఉన్నారు అనే భావన అతనికి కలిగేలా చేయగలగాలి. అప్పుడే వారు ఆ బాధ నుంచి బయటకు వస్తారు. ఒకప్పుడు మానవ సంబంధాలు బాగుండేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లతో బిజీగా ఉంటూ పక్కన వాళ్ళతో కూడా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితి మారాలి." అని నరేష్ అన్నారు.

పవిత్ర మరణం తర్వాత.. చందు తనకిక ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అయ్యాడని, అదే అతని ఆత్మహత్యకు కారణమైందనే అభిప్రాయాన్ని నరేష్ వ్యక్తం చేశారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.