సామ్.. మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్!
on Sep 17, 2021
`యూ టర్న్`(2018) చిత్రంతో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ బాట పట్టింది అగ్ర కథానాయిక సమంత. సదరు కన్నడ రీమేక్ బాక్సాఫీస్ ముంగిట సోసో అనిపించినా.. సామ్ కి నటిగా మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. ఆపై `ఓ బేబీ` (2019)తో పలకరించిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ పరంగా తన ఖాతాలో ఫస్ట్ హిట్ ని జమ చేసుకుంది. త్వరలో సమంత.. వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించిన `శాకుంతలం`తో ఎంటర్టైన్ చేయనుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ విమెన్ సెంట్రిక్ వెంచర్.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. సామ్ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `ఆదిత్య 369`, `వంశానికొక్కడు`, `జెంటిల్ మన్`, `సమ్మోహనం` వంటి విజయంతమైన సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడని వినికిడి. త్వరలోనే సామ్ నెక్స్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.