రేసుగుర్రం ఎక్కనున్న సలోని
on Aug 12, 2013
"మర్యాద రామన్న" చిత్రం తర్వాత సలోని నటించిన ఏ ఒక్క చిత్రం కూడా చెప్పుకోదగ్గ హిట్లు సాధించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు కన్నడ సినిమా వైపు దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో ఏదైనా మంచి సినిమా అవకాశాలు దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్న సలోనికి అనుకోకుండా అవకాశం వచ్చింది.
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న "రేసుగుర్రం" సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ సలోని కొట్టేసింది. ఈ చిత్రంలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా అయిన సలోనికి వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.