ENGLISH | TELUGU  

'రౌడీ గారి పెళ్ళాం' నుంచి పరిచయం.. నా వంతు సపోర్ట్ అందించాలని వచ్చా!

on Dec 3, 2021

సీనియర్ నటి జయలలిత మొట్టమొదటి సారి ఎ.ఆర్.కె విజువల్స్ బ్యానర్ పై  సమరిపిస్తున్న చిత్రం 'రుద్రం కోట'. ఈ చిత్రానికి హీరో మరియు నిర్మాత అనిల్ కండవల్లి. కోన రాము దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విభీష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ ను తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అనిల్ కొండవల్లి, దర్శకుడు కోన రాము, హీరోయిన్  విభీష, రైటర్ వెంకట్ బాబు తదితరులు పాల్గొన్నారు.

టైటిల్ ను విడుదల చేసిన అనంతరం మూవీ టీమ్ కు మోహన్ బాబు అభినందనలు తెలియజేశారు. "జయలలిత చాలా మంచి అమ్మాయి. నాకు రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచీ ఆమె పరిచయం. అప్పటి నుంచి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అలాంటి తను ఈ రోజు మొదటి సారిగా ఒక చిత్రాన్ని సర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్ ను అందించాలని పిలవగానే వచ్చాను. ఎవరైనా చిన్న సినిమా తోనే మొదలుపెట్టి ఎంతో  పెద్ద స్థాయి వరకు వెళ్తారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ చాలా మంచి స్థాయికి వెళ్లాలని, అలానే దర్శకుడు కోన రాము పెద్ద డైరెక్టర్ అయ్యి నాకు కూడా తన సినిమాలో అవకాశం ఇవ్వాలని, అలానే ఆ సాయి నాథుని ఆశీస్సులు మీకు మీ చిత్రానికి ఉండాలని  కోరుకుంటున్నాను" అన్నారు.

జయలలిత మాట్లాడుతూ.. "రుద్రం కోట చాలా మంచి కథ అందుకే  మొదటి సారి అటెంప్ట్ చేస్తున్నాను. హీరో అనిల్ రుద్రంగా, నేను కోటమ్మగా నటిస్తున్నాము. ఈ ఊరు ఖమ్మం డిస్ట్రిక్ట్ లో పోలవరం చుట్టుపక్కల ఉండేది. ఇప్పుడది పోలవరం ప్రాజెక్ట్ లో పోయింది. అక్కడే షూటింగ్ జరుపుకున్నాము. ఇందులో నటించిన  ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది" అన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.