దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరో.. సంక్రాంతి బరిలో 'రౌడీ బాయ్స్'
on Jan 7, 2022

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం 'రౌడీ బాయ్స్'. ఈ సినిమాతో శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనువిందు చేయనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.
నిర్మాతలు దిల్రాజు, శిరీష్ మాట్లాడుతూ "రౌడీ బాయ్స్ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్ వేల్యూస్ను దృష్టిలో పెట్టుకుని 'రౌడీ బాయ్స్' చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. ఎప్పటిలాగే ప్రేక్షకులు మా హీరోని, బ్యానర్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అనుపమ పరమేశ్వరన్ మరోసారి తనదైన నటనతో మెప్పిస్తుంది. మది సినిమాటోగ్రపీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్గా నిలుస్తాయి" అన్నారు.

కరోనా కారణంగా సంక్రాంతి రేస్ నుంచి పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' తప్పుకోవడంతో పెద్ద సినిమాలలో 'బంగార్రాజు' ఒక్కటే సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ క్రమంలో యంగ్ టాలెంట్ తాము ఉన్నామంటూ దూసుకొస్తోంది. జనవరి 14న 'రౌడీ బాయ్స్'తో ఆశిష్, జనవరి 15 న 'హీరో' సినిమాతో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మరి ఈ యంగ్ హీరోలు మొదటి సినిమాతో సత్తా చాటి సంక్రాతి సందడి పెంచుతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



