పూరి తనయుడు 'చోరీ'కి దిగుతున్నాడు
on Jun 13, 2022
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా 'జార్జ్ రెడ్డి' ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'చోర్ బజార్'. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
'చోర్ బజార్' సినిమాని జూన్ 24న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి పూరి డైరెక్ట్ చేసిన 'మెహబూబా', కథ అందించిన 'రొమాంటిక్' సినిమాలతో హీరోగా విజయాన్ని అందుకోలేకపోయిన ఆకాష్.. ఈ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నాడు. 'దళం' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన జీవన్ రెడ్డి ఆ తర్వాత 'జార్జ్ రెడ్డి' సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు దర్శకుడిగా పేరు తీసుకొచ్చినప్పటికీ కమర్షియల్ ఆశించినంత విజయాన్ని అందించలేదు. అందుకేనేమో మూడో సినిమా 'చోర్ బజార్'ను యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా జీవన్ కి, ఆకాష్ కి సాలిడ్ హిట్ అందిస్తుందేమో చూడాలి.
ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.