కోటి ఇరవై లక్షల సెట్లో "డిస్కోరాజా``!
on Jul 22, 2019
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజా`. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం అన్నపూర్ణా ఏడెకరాలలో కోటి 20 లక్షల రూపాయిల సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ షెడ్యూల్ లో రవితేజ, వెన్నెల కిషోర్, శశిర్ షరమ్, టోనిహొప్ లపై సినిమాలో అతి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ ని డైరక్ట్ గా థియేటర్ లో చూస్తే ప్రేక్షకులు ఫీలింగ్ కొత్త గా వుంటుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి... రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్ ని ఆగస్ట్ మెదటివారం నుండి ఢిల్లి లో చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో నభా నటేష్ జాయిన్ కానుంది. దర్శకుడు వి ఐ ఆనంద్ చాలా గొప్ప విజన్ తో పూర్తి వినోదాత్మక చిత్రంగా మలుస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.