రవితేజతో శృతి మించుతోంది!!
on Jun 3, 2019
ఆరేళ్ల క్రితం రవితేజ, శృతి హాసన్, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో `బలుపు` చిత్రం రూపొందిన సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే మరో సారి ఈ ముగ్గురి కలయికలో మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ఇటీవల వార్తలు ఊపందుకుంది. అయితే దాదాపు గోపిచంద్ మలినేని, రవితేజ కలయికలో సినిమా ఖరారైంది. అయితే ఇక తాజాగా ఈ సినిమాలో శృతి హాసన్ కూడా హీరోయిన్ గా ఫైనల్ అయినట్లే అంటున్నారు సినీ జనాలు. ఇటీవల దర్శకుడు గోపించంద్ శృతి హాసన్ కు స్టోరి చెప్పి ఒప్పించడాట. ఆమెకు కూడా క్యారక్టర్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక గతంలో డాన్ శీను, బలుపు సినిమాలు రవితేజ్ తో చేసి సక్సెస్ సాధించిన మలినేని రవితేజతో హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోందట. ప్రజంట్ రవితేజ `డిస్కో రాజా` లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే మలినేనితో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక శృతి హాసన్ పవన్ కళ్యాన్ తో `కాటమరాయుడు` సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. ఇక లేటెస్ట్ గా మైఖేల్ తో బ్రేకప్ చేసుకున్న శృతి సినిమాలపై దృష్టి సారించింది.