వన్స్ మోర్.. నితిన్, రష్మిక పెయిర్?
on Jun 20, 2021
`భీష్మ` చిత్రంలో యూత్ స్టార్ నితిన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న జోడీ ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ.. సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `నా పేరు సూర్య` ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్నట్లు గతకొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. `ఠాగూర్` మధు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. కాగా, ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా రష్మికని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు రష్మికతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. త్వరలోనే నితిన్ - వక్కంతం వంశీ కాంబినేషన్ మూవీలో రష్మిక ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ఇదిలా ఉంటే.. నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో` చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జనం ముందుకు రానుంది. ఇక రష్మిక విషయానికి వస్తే `పుష్ప`, `ఆడవాళ్ళూ మీకు జోహార్లు` వంటి తెలుగు చిత్రాలు.. `మిషన్ మజ్ను`, `గుడ్ బై` వంటి హిందీ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Also Read