హనీమూన్ నుండి తిరిగొచ్చిన రానా
on Oct 24, 2020
కరోనా కాలాన్ని పూర్తి సద్వినియోగం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారంటే... అందులో రానా పేరు ముందువరుసలో ఉంటుంది. కొవిడ్-19 మహమ్మారి వలన ప్రపంచం కొన్ని నెలలు స్తంభించింది. సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఆ సమయంలో చాలామంది ఇళ్లకు పరిమితం అయ్యారు. రానా దగ్గుబాటి సైతం ఇంటిలో ఉన్నారు. అయితే, కరోనా కాలంలో పెళ్లి పనులు చక్కబెట్టుకున్నారు. అలాగే, హనీమూన్ కూడా వెళ్లొచ్చారు.
పెళ్లైన తరవాత కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్న రానా, మొదట గోవా వెళ్లారు. అక్కడి నుండి విదేశాలు వెళ్లిన్నట్టు తెలుస్తోంది. మొన్నామధ్య భర్త రానాతో కలిసి దిగిన ఫోటోను మిహీకా బజాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ దంపతులు హనీమూన్ ముగించుకుని గురువారం రాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ తొలి వారం నుండి 'విరాటపర్వం' చిత్రీకరణను రానా ప్రారంభించనున్నారు. అలాగే, ఆ తరువాత చేయబోయే సినిమాల మీద దృష్టి పెట్టనున్నారు.
Also Read