అఫీషియల్: ప్రభాస్ సినిమా కోసం బాలీవుడ్ హీరోని అప్రోచ్ కాలేదు!
on Oct 24, 2020
అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన 'తానాజీ' ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్. జనవరి 10న విడుదలైన ఆ సినిమా సుమారు 350 కోట్లు కలెక్ట్ చేసింది. 'తానాజీ' తీసిన దర్శకుడు ఓం రౌత్, వచ్చే ఏడాది ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' తెరకెక్కించనున్నాడు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమాలో ఓ పాత్రకు కోసం అజయ్ దేవగణ్ను అప్రోచ్ అయినట్టు వార్తలు వచ్చాయి. 'తానాజీ' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో అజయ్ కూడా నటించడానికి సుముఖంగా ఉన్నారనే మాటలు వినిపించాయి. అయితే, అవన్నీ రూమర్లే.
'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు ఎవరూ అజయ్ దేవగణ్ని అప్రోచ్ కాలేదని అజయ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బాలీవుడ్ మీడియాలో వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. 'ఆదిపురుష్'లో శివుడి పాత్రలో అజయ్ కనిపించనున్నారని ప్రచారం జరిగింది. మరి, శివుడి పాత్రకు ఇప్పుడు ఎవరిని తీసుకుంటారో? వెయిట్ అండ్ సి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.