కుట్ర చేసి 'శేఖర్' సినిమా ప్రదర్శన నిలిపివేశారు
on May 22, 2022
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ 'శేఖర్'. జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 20న విడుదలై మంచి టాకే తెచ్చుకుంది. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ప్రదర్శన నిలివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కొందరు కుట్ర చేసి తమ సినిమా ప్రదర్శన నిలిపివేశారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
'శేఖర్' కోసం తన దగ్గర రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్న నిర్మాత,దర్శకురాలు జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదివారం సాయంత్రం 4:30 గంటలు లోపు రూ. 65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో జీవిత సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ అలా డిపాజిట్ చేయలేని పక్షంలో 'శేఖర్' సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్మెంట్ చేస్తూ.. అంటే థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో కానీ సినిమా తోపాటు ట్రైలర్స్, పాటలతో సహా ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై తాజాగా స్పందించిన రాజశేఖర్.. సినిమా కోసం తమ కుటుంబమంతా ఎంతో కష్టపడి పనిచేసిందని అన్నారు. ఈ సినిమాకి మంచి స్పందన వచ్చిందని, కొందరు కుట్ర చేసి తమ సినిమా ప్రదర్శన నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శేఖర్ విడుదలకు ముందు ఈ సినిమా హిట్ అయితే తాము అప్పుల నుంచి బయటపడతామని రాజశేఖర్ అన్నారు. అలాంటిది ఇప్పుడు అప్పు చెల్లించని కారణంగా సినిమా ప్రదర్సన నిలిచిపోయింది.
Also Read