రాజమౌళి షార్ట్ ఫిలిమ్
on Oct 21, 2014
.jpg)
హుద్ హుద్ తుపాను విశాఖను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితుల కోసం విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తుపాను బాధితులను ఆదుకోవడానికి రాజీవ్ మీనన్ తో కలిసి ఓ వీడియోను రూపొందించారు. యువ హీరో రానానేపథ్య గాత్రం అందించారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దీపావళి అన్నది టైటిల్. స్వామిరారాలో నటించిన బాల నటుడు, థర్టీ ఇయర్స్ పృధ్వీ తదితరులు నటించారు. దీపావళి ఖర్చు కొంత తగ్గించుకుని, దానిని తుపాను బాధితుల కోసం సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు ఇవ్వమనే సందేశం ఈ సినిమా కాన్సెప్ట్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



