బన్నీ గుర్రం పాటల తేది ఖరారు
on Mar 4, 2014
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియోను మార్చి14న విడుదల చేయనున్నారు. అయితే వేదిక వివరాలు ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.
ఈ సినిమా దాదాపు అందరికి తొలి కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. సురేందర్ రెడ్డితో బన్నీకి ఇదే తొలి చిత్రం. అలాగే బన్నీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తొలిసారిగా బన్నీతో కలిసి శృతిహాసన్, సలోనిలు జతకడుతున్నారు. ఇలా అన్ని తొలి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అదిరిపోయే రేంజులో ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
బన్నీ ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలు కూడా సంగీత పరంగా బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అందుకే ఎలాగైనా ఈ చిత్ర ఆడియోను బ్లాక్ బస్టర్ హిట్ చేయించాలని తమన్ చాలా కష్టపడి, అదిరిపోయే పాటలను అందించాడని తెలిసింది. ఈ చిత్ర ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ దాదాపు 54 లక్షలకు సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.