ఉక్రెయిన్లో తారక్, చరణ్, ఆలియా!
on Jul 31, 2021
ఈ దసరాకి సరదాలను పంచడానికి సిద్ధమవుతోంది `ఆర్ ఆర్ ఆర్` బృందం. ఇప్పటికే ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టిన యూనిట్.. ఇప్పుడు బాకీ ఉన్న షూటింగ్ ని కూడా ఫినిష్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న ఒకే ఒక పాటని పిక్చరైజ్ పనిలో ఉన్నారట దర్శకధీరుడు రాజమౌళి. అంతేకాదు.. ఈ పాటని ఉక్రెయిన్ లో భారీ స్థాయిలో చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ కలర్ ఫుల్ సాంగ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పాల్గొంటారని.. ఆగస్టు 2 నుంచి ఆ నెల రెండో వారం వరకు చిత్రీకరణ జరుగుతుందని టాక్. అంతేకాదు.. ఈ గీతం సినిమాలో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని వినికిడి. మరి.. ఎన్నో విశేషాలతో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే అక్టోబర్ 13 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రకని ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ పిరియడ్ డ్రామాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ - ఇండియా మూవీగా `ఆర్ ఆర్ ఆర్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read