పిఠాపురం లో పవన్ తరుపున టిల్లు స్క్వేర్ ప్రచారం
on May 9, 2024
సినిమా రంగం నుంచి వచ్చిన పవర్ స్టార్ బిరుదుతో పవన్ కళ్యాణ్ జనసేన అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు.ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు.ఇక పవన్ ని గెలిపించాలని కోరుతు మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ కోవలో ఒక భారీ నిర్మాత వచ్చి చేరాడు.
సూర్యదేవర నాగ వంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలని నిర్మించాడు. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ ని అందుకున్నాడు.మహేష్ గుంటూరు కారం కి కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు.ఇప్పుడు ఈయన పిఠాపురంలో ఇంటింటికీ తిరుగుతు పాంప్లెట్స్ పంచిపెడుతు పవన్కి ఓటేయాలని అభ్యర్దిస్తున్నాడు. నాగ వంశీ పాటు ఆయన టీమ్ కూడా ప్రచారంలో పాల్గొంది. వాటి తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసారు
ఇటీవల తన కొత్త మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించిన ఫంక్షన్లో పవన్ తరుపున ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు అన్న మాట నిలబెట్టుకున్నాడు.
అలాగే హైదరాబాద్ తో సహా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరారు. భీమ్లా నాయక్ , రంగ్ దే, బాబు బంగారం, భీష్మ, జెర్సీ, సార్, ఆదికేశవ, మ్యాడ్ లాంటి చిత్రాలని సితార నిర్మించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ కూడా వీళ్లదే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం, అరవిందసమేత, అజ్ఞాత వాసి, గుంటూరు కారం లాంటి చిత్రాలు ఆ బ్యానర్ లో వచ్చాయి.
Also Read