రామ్ చరణ్ చేతుల మీదుగా 'పరంపర-2' ట్రైలర్
on Jul 8, 2022

డిస్నీప్లస్ హాట్స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర-2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు.
ట్రైలర్ చూస్తే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా పరంపరం-2 వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. "ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు" అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూలై 21 నుంచి 'పరంపర' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



