గోపీచంద్ పంతం ఎవరిమీద ??
on Jun 6, 2018
యజ్ఞం, రణం, ఆంధ్రుడు, లక్ష్యం లాంటి సినిమాలతో మాస్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్.. ఈ మధ్య సరైన సినిమాలు పడక కాస్త స్లో అయ్యాడు.. కానీ తాజాగా రిలీజైన 'పంతం' టీజర్ చూస్తుంటే గోపీచంద్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు.. అయితే ఈ టీజర్లో డైలాగ్ వింటేనే ఏదో పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.. ' ఫ్రీగా ఇళ్లిస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి ఐదువేలిస్తాం అనగానే ముందు-వెనక, మంచి-చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతిలేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడినుంచి వస్తదోయ్' అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.. కానీ ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఏదో పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.. అసలు గోపీచంద్ టార్గెట్ ఎవరు? పంతం ఎవరి మీద? తెలియాలంటే సినిమా వచ్చేవరకు వేచిచూడాల్సిందే...