భయపెట్టే వాళ్ళకోసం తులసీరామ్ వేట
on Jul 16, 2013
"మంత్ర", "మంగళ" వంటి చిత్రాలతో భయపెట్టిన దర్శకుడు ఓషో తులసీరామ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మంత్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సి.హెచ్.వి. శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో తులసీరామ్ తీసిన "మంత్ర", "మంగళ" చిత్రాలు జనాలను బాగా భయపెట్టాయి.
అయితే ఈ కొత్త చిత్రంలో మరింత భయపెట్టే కథను రెడీ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపికలు జరుగుతున్నాయి. మరి ఈ సెలక్షన్స్ లో ఎంపిక అయినవారు ఎంత భయపెడతారో చూడాలి.
మరి ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ మీకోసం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.