బీకీపింగ్ కి రెడీ అయిన సాయిపల్లవి..అవార్డ్స్ కంటే ప్రేక్షకులే ముఖ్యం
on Apr 22, 2025
స్టార్ హీరోయిన్ 'సాయిపల్లవి'(Sai Pallavi)గత ఫిబ్రవరిలో 'తండేల్'(Thandel)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో హిందీలో 'రామాయణ' మూవీ చేస్తుంది. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించే సాయిపల్లవి 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లిగా కనపడుతుండటంతో ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్(Ranbir Kapoor)రాముడిగా కనిపిస్తున్నాడు.
సాయి పల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు అవార్డులు కన్నా ప్రేక్షకుల ప్రేమని గెలుచుకోవడమే ముఖ్యం. ఒక క్యారక్టర్ ని ఎంచుకునేటప్పుడు అందులోని లోతెంత, బలమైన భావోద్వేగం ఉందా లేదా, చూసుకుంటాను. సదరు క్యారక్టర్ ద్వారా నిజాయితితో కూడిన కథని ప్రేక్షకులకి అందేలా చెయ్యాలని తపన పడుతుంటాను. ఆ విధంగా నేను అనుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే అదే గొప్ప విజయంగా భావిస్తాను. ఆ తర్వాత అవార్డులు అనేవి బోనస్. అందుకే అవార్డులకన్నా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి తొలి ప్రాధాన్యమిస్తుంటాను. ప్రస్తుతం బీకీ పింగ్ (తేనెటీగల) పెంపకం పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఈ కొత్త హాబీ ద్వారా ప్రకృతితో మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
2015 లో 'ప్రేమమ్' అనే మలయాళ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఇప్పటి వరకు తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో కలిపి సుమారు 17 చిత్రాలదాకా చేసింది. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్(Film Fare Awards)తో పాటు పలు అవార్డ్స్ గెలుచుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
