మహేష్ బాబుకి ఈడీ నోటీసులు!
on Apr 21, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి సూర్య, సురానా డెవలపర్స్ వంటి పలు సంస్థలకి ప్రమోటర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది.
ఈ రెండు సంస్థల నుంచి యాడ్స్ కోసం మహేష్ రూ.3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
