'మనం' ఛానెల్ లేదు.. అన్నీ పుకార్లే
on Apr 15, 2015
.jpg)
తెలుగు ప్రజల కోసం త్వరలో మరో ఎంటర్టైన్మెంట్ ఛానెల్ రాబోతుందని, దీనిని అక్కినేని నాగార్జున..ప్రసాద్ వి.పొట్లూరి కలిసి లాంచ్ చేయబోతున్నారని గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు హంగామా చేస్తున్నాయి. 'మా' ఛానల్లో మేజర్ వాటాలను స్టార్ నెట్వర్క్ దక్కించుకున్న తరువాత నాగార్జున ‘మనం’ ఛానల్ లాంచ్ చేయాలని భావించారన్నది ఈ వార్తల సారాంశం. అయితే తాజాగా ఈ వార్తలను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వార ఖండించారు. నేను 'మనం' పేరు మీద ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లాంచ్ చేయబోతున్నానని వస్తున్న వార్తలన్ని కేవలం కల్పితమేనని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం నాగార్జున వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ షూటింగ్ తో బిజీగా వున్నారు.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



