శైలజారెడ్డి... డిజప్పాయింట్ చేసింది!
on Nov 1, 2018
అక్కినేని నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలపై నాగార్జున పెదవి విరిచారు. రివ్యూలు సరిగా రాకున్నా.. సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయని సంతోషంగా చెప్పుకున్నారు. కానీ, సినిమాలో హీరోగా నటించిన ఆయన ప్రథమ పుత్రుడు అక్కినేని నాగచైతన్య తనను సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేసిందనీ, ఓపెనింగ్స్ బాగా వచ్చినందుకు సంతోషించినా... దాన్ని నిలబెట్టుకోలేక పోయిందండుకు నిరాశ చెందానని 'సవ్యసాచి' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మారుతి కథ చెప్పినప్పుడు బావుందని, ఎందుకు వర్కవుట్ కాలేదో తెలియలేదని నిజాయతీగా తన మనసులో మాటను నాగచైతన్య బయటపెట్టాడు. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న 'సవ్యసాచి' మాత్రం ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను డిజప్పాయింట్ చేయదని నాగచైతన్య ముందునుంచి చెబుతున్నారు. చందూ మొండేటి సినిమాను చక్కగా తీశారని ప్రశంసించారు. సినిమా ఫస్టాఫ్ అంతా వినోదాత్మకంగా, సెకండాఫ్ అంతా ఎమోషనల్ గా సాగుతుందని నాగచైతన్య తెలిపారు.