నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్ కుమార్తె కన్నుమూత
on Aug 1, 2022
నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె, బాలకృష్ణ సోదరి ఉమా మహేశ్వరి కన్నుమూశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలిసి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.
ఉమా మహేశ్వరి భర్త పేరు కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్. ఇటీవల ఆమె చిన్న కుమార్తె వివాహం జరిగింది. ఉమా మహేశ్వరి హఠాన్మరణంతో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.