'వారియర్'తో సాయి పల్లవి, ప్రభుదేవా వార్
on Jul 6, 2022
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం 'ది వారియర్'. ఈ బైలింగ్వెల్ మూవీ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి రోజే మరో రెండు తమిళ్ సినిమాలు బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నాయి. అందులో ఒకటి సాయి పల్లవి నటించిన 'గార్గి' కాగా, రెండోది ప్రభుదేవా నటించిన 'మై డియర్ భూతం'.
ఎన్.రాఘవన్ దర్శకత్వంలో ప్రభుదేవా ప్రధాన పాత్ర పోషించిన 'మై డియర్ భూతం' తమిళ్ తో పాటు తెలుగులోనూ జులై 15న విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. అయితే 'ది వారియర్' ముందు 'గార్గి', 'మై డియర్ భూతం' సినిమాలు ఎంతవరకు నిలబడగలవు అనేది చూడాలి. తెలుగులో ఖచ్చితంగా 'ది వారియర్'దే పైచేయి ఉంటుంది. అలాగే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో తమిళ్ లోనూ మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరి 'వారియర్' జోరులో 'గార్గి', 'మై డియర్ భూతం' చిత్రాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో!.
లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇటీవల 'విరాట పర్వం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఏ మాత్రం బజ్ లేకుండా వస్తున్న 'గార్గి'తో ప్రేక్షకులను థియేటర్స్ కి వచ్చేలా చేయడం కష్టమనే చెప్పాలి. అలాగే 'మై డియర్ భూతం'పై కూడా ఏం మాత్రం బజ్ లేదు. మరి వారియర్ ని ఢీకొడుతున్న ఈ రెండు సినిమాలు ఏదైనా అద్భుతం చేస్తాయేమో చూడాలి.